ఏపీ ఈఏపీ సెట్‌ ప్రశాంతం

ABN , First Publish Date - 2022-07-05T06:18:48+05:30 IST

ఏపీఈఏపీ సెట్‌ మొదటి రోజు సోమవారం ప్రశాం తంగా జరిగింది.

ఏపీ ఈఏపీ సెట్‌ ప్రశాంతం
నరసాపురంలో..

భీమవరం ఎడ్యుకేషన్‌/ తాడేపల్లిగూడెం రూరల్‌/ నరసాపురం రూరల్‌/ జూలై 4: ఏపీఈఏపీ సెట్‌ మొదటి రోజు సోమవారం ప్రశాం తంగా జరిగింది. జిల్లాలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో రెండు సెషన్లుగా పరీక్ష నిర్వహించారు. ఈనెల 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించను న్నారు. 4వ తేది నుంచి 9 తేదీ వరకు ఇంజనీరింగ్‌, 11,12 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసి ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించారు. భీమవరంలోని విష్ణు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఉదయం 109 మందికి 105, మధ్యాహ్నం 109 మందికి 106, డీఎన్‌ఆర్‌ ఇంజనీరింగ్‌లో 131 మందికి 124, రెండో సెషన్‌లో 131కి 121,  నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్‌ కళాశాలలో 100 మందికి 98, రెండో సెషన్‌లో 100 మందికి 98, తాడేపల్లిగూడెం వాసవీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 250 మందికి 239 మంది మధ్యాహ్నం 244 మంది హాజరయ్యారు. శశి ఇంజనీరింగ్‌ కళాశాలలోనూ పరీక్షలు జరిగాయి. నరసాపురం మండలం లోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్‌ కళాశాలలో  196 మంది విద్యార్థులు హాజ రు కాగా నలుగురు గైర్హాజరయ్యారు. భీమవరంలో ప్రధాని పర్యటన ఉన్నా  విద్యార్థులు పెద్దగా ఇబ్బంది పడలేదు.

Updated Date - 2022-07-05T06:18:48+05:30 IST