క్రికెట్ బెట్టింగుల్లో పలువురి అరెస్ట్
ABN , First Publish Date - 2021-04-21T05:35:21+05:30 IST
జిల్లాలోని పలుచోట్ల క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్న పలువురిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏలూరు క్రైం/తణుకు, ఏప్రిల్ 20: జిల్లాలోని పలుచోట్ల క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్న పలువురిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు శివారు దొండపాడు వీవర్స్ కాలనీలో క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్నారని తెలుసుకున్న సీఐ వరప్ర సాద్ ఆధ్వర్యంలో త్రీ టౌన్ ఎస్ఐ ఎంవీ రమణ సిబ్బందితో వెళ్లి దాడిచేశారు. బులసర జ్ఞాన శివసాయి, బెరీ స్వామిశంకర్, వేమూరెడ్డి రాజేంద్రప్రసాద్, దేవరపల్లి మోహనకుమార్, అజాడ సాయికుమార్, అజయ్కుమార్(24)లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఆరు మొబైల్ ఫోన్లు, రూ.6,900 నగదు స్వాధీనం చేసు కున్నారు. తణుకు పట్టణం వేల్పూరు రోడ్డులోని అపార్ట్మెంట్లో క్రికెట్ ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు దాడి చేశారు. పట్టణానికి చెందిన మహాపాత్ర హరీష్, ముప్పిడి కిరణ్ కుమార్, పైడిపర్రుకు చెందిన గొర్రెల సాయిబాబా, తిరుపతికి చెందిన చంద్రశేఖరరెడ్డిలను అరెస్టు చేసి వారి నుంచి నాలుగు సెల్ఫోన్లు, ఒక ఎల్ఈడీ టీవీ, 2500 నగదు స్వాధీనం చేసు కున్నట్టు ఎస్ఐ కె.రామారావు తెలిపారు. కేసులో ఽబీమవరం, పాలకొల్లు, విశాఖపట్నం, పాలంగి, సావరం, తణుకు, పైడిపర్రు, విజయవాడ, హైదరాబాద్లతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన 20 మందికి సంబంధం ఉన్నట్లు గుర్తించామన్నారు. వారి బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి, విచారణ చేస్తామని చెప్పారు.