గ్రీన్ఫీల్డ్ నిర్వాసితులకు న్యాయం చేస్తాం : కలెక్టర్
ABN , First Publish Date - 2022-07-02T06:37:07+05:30 IST
గ్రీన్ఫీల్డ్ హైవేకు భూ ములు అందించిన రైతులకు ప్రభుత్వ నిబంధనల మేరకు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు.
ఏలూరు కలెక్టరేట్, జూలై 1 : గ్రీన్ఫీల్డ్ హైవేకు భూ ములు అందించిన రైతులకు ప్రభుత్వ నిబంధనల మేరకు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. భూములు అందించిన చింతలపూడి, టి.నర సాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం గ్రామాల రైతులతో శుక్రవారం కలెక్టరేట్లో సమావేశమ య్యారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణా నికి 31 గ్రామాలకు చెందిన రైతుల నుంచి 1,200 ఎకరాల వరకూ భూసేకరణ చేశామని, పరిహారంపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి భూములు అందించిన రైతులకు అందించిన తరహాలో ఎకరానికి 52 లక్షలు ఇవ్వాలని, సర్వీసు రోడ్లు నిర్మించాలని నిర్వాసితులు కోరారు. జేసీ అరుణ్బాబు, ఆర్డీవోలు రాజ్యలక్ష్మి, ఝాన్సీరాణి, ఎన్హెచ్ 5 అధికారులు తదితరులు పాల్గొన్నారు.