ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా చర్యలు తీసుకోండి
ABN , First Publish Date - 2021-09-18T05:21:25+05:30 IST
ఈనెల 19వ తేదీన నిర్వహించనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపుపై విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీపీవోలు, జడ్పీ సీఈవోలు తదితర అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశం
ఏలూరుసిటీ, సెప్టెంబరు 17: ఈనెల 19వ తేదీన నిర్వహించనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపుపై విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీపీవోలు, జడ్పీ సీఈవోలు తదితర అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపునకు సంబంధించి నియమావళి విధిగా పాటించాలన్నారు. లెక్కింపు కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. వీసీలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, ఏలూరు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, జేసీలు పాల్గొన్నారు.