నేటితో ముగియనున్న అభ్యర్థుల ప్రచారం

ABN , First Publish Date - 2021-03-08T06:06:20+05:30 IST

నగర పాలక సంస్థకు ఈనెల 10వ తేదీన జరగ బోయే ఎన్నికలకు సోమవారంతో ప్రచారం ముగియనుంది.

నేటితో ముగియనున్న  అభ్యర్థుల ప్రచారం

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, మార్చి 7: నగర పాలక సంస్థకు ఈనెల 10వ తేదీన జరగ బోయే ఎన్నికలకు సోమవారంతో ప్రచారం ముగియనుంది. గత రెండు వారాల నుంచి ముమ్మరంగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం సాగించాయి. తెలుగు దేశం, వైసీపీ, సీపీఐ, సీపీఎం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీలు నువ్వానేనా అన్న రీతిలో ప్రచారాన్ని కొనసాగించా యి. ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు ఎన్నికలకు రెండు రోజుల ముందు గానే ప్రచారాన్ని ఆపేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం సోమవారం సాయం త్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. ఐదు గంటల తర్వాత ప్రచారం చేసే పార్టీలు, నాయకులపై ఎన్నికల కమీషన్‌ చర్యలు తీసుకుంటుంది. నగ రంలో 50 డివిజన్లకు 171 నామినేషన్లు ఖరారు చేశారు.  నేటితో ప్రచారం ముగియనుండడంతో అభ్యర్థులంతా తమ తమ డివిజన్లల్లో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. తమకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

Updated Date - 2021-03-08T06:06:20+05:30 IST