28 వరకు ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షకు దరఖాస్తు

ABN , First Publish Date - 2021-01-24T05:34:53+05:30 IST

ఫిబ్రవరి 14న నిర్వహించనున్న నేషనల్‌ మీన్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌)పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 28వ తేదీ వరకు పొడిగించారని డీఈవో సీవీ రేణుక తెలిపారు.

28 వరకు ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షకు దరఖాస్తు

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 23: ఫిబ్రవరి 14న నిర్వహించనున్న నేషనల్‌ మీన్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌)పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 28వ తేదీ వరకు పొడిగించారని డీఈవో సీవీ రేణుక తెలిపారు. పరీక్ష రుసుమును ఈనెల 30వ తేదీ వరకు చెల్లించేందుకు తుది అవకాశం ఇచ్చారని వివరించారు. వివరాలకు ఠీఠీఠీ.ఛట్ఛ.్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ నుంచి తెలుసుకోవాలని సూచించారు. ఎక్కువ మంది విద్యార్థులు ఈ పరీక్షకు నమోదు చేసుకునేలా చూడాలని హెచ్‌ఎంలు, ఎంఈవోలు, డీవైఈవోలను ఆదేశించారు. 


Updated Date - 2021-01-24T05:34:53+05:30 IST