బాధితులకు ఉచిత భోజనం
ABN , First Publish Date - 2021-05-11T05:35:16+05:30 IST
ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడిలలో హోం ఐసొలేషన్లో వున్న కరోనా బాధి తులకు ఉచిత భోజన పదార్థాల పంపిణీ చేస్తున్నట్టు ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్) ఏలూరు శాఖ నిర్వహణ కార్యదర్శి మహ్మద్ హుస్సేన్ తెలిపారు.
ఫోన్ చేస్తే ఇంటికే సరఫరా
ఏలూరు ఎడ్యుకేషన్, మే 10 : ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడిలలో హోం ఐసొలేషన్లో వున్న కరోనా బాధి తులకు ఉచిత భోజన పదార్థాల పంపిణీ చేస్తున్నట్టు ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్) ఏలూరు శాఖ నిర్వహణ కార్యదర్శి మహ్మద్ హుస్సేన్ తెలిపారు. సంస్థ నిర్వాహకులు సరెళ్ళ సతీష్ సావిత్రి ఏలూరులో సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పలువురు బాధితులకు ఆహార పదార్థాలను అందజేశారు. భోజనం కావాల్సిన వారు 94403 02153 నెంబరులో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.