చిన వెంకన్నకు బంగారు సింహాసనం

ABN , First Publish Date - 2021-01-25T05:58:47+05:30 IST

ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యకల్యాణం నిమిత్తం కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన పర్వతనేని పాండురంగారావు, రాధిక దంపతులు బంగారు సింహాసనాన్ని బహూకరించారు.

చిన వెంకన్నకు బంగారు సింహాసనం
బంగారు సింహాసనాన్ని బహూకరించిన దాతలు

విలువ రూ.12 లక్షలు.. బహూకరించిన దాతలు

ద్వారకా తిరుమల, జనవరి 24 : ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యకల్యాణం నిమిత్తం కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన పర్వతనేని పాండురంగారావు, రాధిక దంపతులు బంగారు సింహాసనాన్ని బహూకరించారు. రూ.12 లక్షల విలువైన బంగారంతో దీనిని తయారు చేయించారు. గతంలో వీరు స్వామి వారి గర్భాలయంలో వెండి పుట్ట, 400 గ్రాముల బంగారంతో తయారు చేయించిన గోవింద నామాలు కలిగిన గజలక్ష్మి మాలలు బహుకరించారు. దాతలను దేవస్థానం చైర్మన్‌ ఎస్‌ఈ సుధాకర్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. దాతల దాతృత్వంతో దేవాలయాలు, అనుబంధ ట్రస్టులు అభివృద్ధి చెందుతాయన్నారు.

Updated Date - 2021-01-25T05:58:47+05:30 IST