186 మంది బదిలీ..
ABN , First Publish Date - 2022-07-02T06:11:15+05:30 IST
మునిసిపాలిటీల్లో ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారిని మరో చోటుకు బదిలీ చేశామని మునిసి పల్ రీజనల్ డైరెక్టర్ ఎన్వీవీ సత్యనారాయణ తెలిపారు.
మునిసిపల్ రీజనల్ డైరెక్టర్ సత్యనారాయణ
భీమవరం టౌన్, జూలై 1 : మునిసిపాలిటీల్లో ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారిని మరో చోటుకు బదిలీ చేశామని మునిసి పల్ రీజనల్ డైరెక్టర్ ఎన్వీవీ సత్యనారాయణ తెలిపారు. ఈనెల 4న ప్రధాని మోదీ భీమవరం రానున్న నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణ, ఏర్పాట్లు, తదితర అంశాలను పరిశీలించేందుకు శుక్ర వారం ఆయన భీమవరం విచ్చేశారు. ఈ సందర్భంగా విలేకరు లతో మాట్లాడుతూ మొత్తం 186 మంది ఉద్యోగులను బదిలీ చేశామని, బదిలీ ప్రక్రియ పూర్తయినట్లేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని సభా ప్రాంతాన్ని, 30 అడుగుల విగ్రహ ప్రాంతాన్ని, పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీ లించి వివరాలను కమిషనర్ ఎస్.శివరామకృష్ణ నుంచి అడిగి తెలుసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ జ్యోతి లక్ష్మి, ఎంఈ పి.శ్రీకాంత్, డీఈ కె.రాజారావు, మునిసిపల్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, తదితరులు ఉన్నారు.