బడిలో ఎన్నికల గంట

ABN , First Publish Date - 2021-09-16T05:42:08+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల గంట మోగనుంది.

బడిలో ఎన్నికల గంట

22న తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు

నేడు నోటిఫికేషన్‌ జారీ

ఏలూరు రూరల్‌, సెప్టెంబరు 15: ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల గంట మోగనుంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ కమిటీ (పీ ఎంసీ)ల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబి తాలను పాఠశాలల నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. 20వ తేదీన అభ్యంతరాలు స్వీకరణ, సాయంత్రం 3 గంటల నుంచి ఓటర్ల జాబితా నోటీసు బోర్డులో ఉంచి 22న తల్లిదండ్రుల కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లాలో 3,294 పాఠశాలల్లో ఎన్నికలు జరగనున్నాయి. 

Updated Date - 2021-09-16T05:42:08+05:30 IST