150 మంది అరెస్టు..రూ.26.10 లక్షలు స్వాధీనం
ABN , First Publish Date - 2021-01-17T05:39:11+05:30 IST
జిల్లా వ్యాప్తంగా శనివారం కూడా పోలీసులు దాడులు నిర్వహించారు.
ఏలూరు క్రైం, జనవరి 16: జిల్లా వ్యాప్తంగా శనివారం కూడా పోలీసులు దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఐదు సబ్ డివిజన్లలో దాడులు నిర్వహించారు. పేకాటకు సంబంధించి 15 కేసులు నమోదు చేశారు. 134 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.26 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కోడిపందేలు ఆడుతున్న వారిపై మూడు కేసులు నమోదు చేసి 16 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10 వేలు నగదు, ఐదు కత్తులు, ఐదు కోళ్లు స్వాధీనం చేసుకున్నారు.