వ్యాక్సిన్‌ కేంద్రం వద్ద పోలీస్‌ బందోబస్తు

ABN , First Publish Date - 2021-06-22T05:00:51+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ వేయడానికి ఏలూరు నగరంలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పా టు చేశారు.

వ్యాక్సిన్‌ కేంద్రం వద్ద పోలీస్‌ బందోబస్తు
మైక్‌లో తగిన సూచనలు ఇస్తున్న టూటౌన్‌ సీఐ బోణం ఆది ప్రసాద్‌

ఏలూరు క్రైం, జూన్‌  21 : కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ వేయడానికి ఏలూరు నగరంలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పా టు చేశారు. ఏలూరు తంగెళ్లమూడి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రానికి సోమవారం భారీగా జనం చేరు కున్నారు. ఈ నేపథ్యంలో టూటౌన్‌ సీఐ బోణం ఆదిప్రసాద్‌, సిబ్బం ది మహిళా సంరక్షణ కార్యదర్శులు బందోబస్తు నిర్వహించారు. అయితే ఆ కేంద్రం వద్ద జనం రద్దీ పెరగడం గుర్తించి డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌ కిరణ్‌ వెంటనే డిస్ట్రిక్ట్‌ ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నాగేశ్వరరావుకు తెలిపి టైటస్‌ నగర్‌లో మరో వ్యాక్సిన్‌  కేంద్రం ఏర్పాటు చేసి సగం మందిని అక్కడకు తరలించారు.  

Updated Date - 2021-06-22T05:00:51+05:30 IST