26న అన్ని పాఠశాలల్లో గణతంత్ర వేడుకలు

ABN , First Publish Date - 2021-01-24T05:33:19+05:30 IST

ఈనెల 26న అన్ని పాఠశా లల్లో గణతంత్ర వేడుకలు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

26న అన్ని పాఠశాలల్లో గణతంత్ర వేడుకలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 23 : ఈనెల 26న అన్ని పాఠశా లల్లో గణతంత్ర వేడుకలు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోజున పాఠశాలల్లో పతాకావిష్కరణ, జెండా వందనం, జాతీయ గీతాలాపన నిర్వహించాలని సూచించారు. ఉదయం పూట వీధుల్లో విద్యార్థులతో మార్చిఫాస్ట్‌ నిర్వహించాలని, దేశభక్తి గీతాలు పాడించాలని సూచించారు. బాలబాలికలందరికీ మిఠాయిలు పంపిణీ చేయాలన్నారు. 


Updated Date - 2021-01-24T05:33:19+05:30 IST