రిజర్వేషన్‌ మార్చాల్సిందే!

ABN , First Publish Date - 2021-03-06T06:32:47+05:30 IST

ఎల్‌ఎన్‌డీ పేట గ్రామస్థులు ఎన్నికలను మళ్లీ బహిష్కరిస్తున్నట్టు శుక్రవారం ప్రకటిం చారు.

రిజర్వేషన్‌ మార్చాల్సిందే!
ర్యాలీ నిర్వహిస్తున్న ఎల్‌ఎన్‌డీ పేట గ్రామస్థులు

 పంచాయతీ ఎన్నికలను మళ్లీ బహిష్కరించిన ఎల్‌ఎన్‌డీ పేట గ్రామస్థులు 

పోలవరం, మార్చి 5: ఎల్‌ఎన్‌డీ పేట గ్రామస్థులు ఎన్నికలను మళ్లీ బహిష్కరిస్తున్నట్టు శుక్రవారం ప్రకటిం చారు. ఎల్‌ఎన్‌డీ పేటను గిరిజనేతర పంచాయతీగా ప్రక టించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల రిట ర్నింగ్‌ అధికారి మద్దాల నాగేశ్వరరావుకు వినతిపత్రం అం దించారు. గ్రామస్థులు పలువురు మాట్లాడుతూ ‘గిరిజ నులే లేని తమ పంచాయతీని గిరిజన పంచాయతీగా పరిగణించి రిజర్వేషన్లు కేటాయించటం సరికాదు. దీని వల్ల తమ పిల్లలకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకా లు అందడంలేదు. చదువులు, ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గిరిజ నేతర పంచాయతీగా నిర్ణయించి ఎన్నికలు నిర్వహించా లని, వినతిపత్రాలు ఇస్తున్నాం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బహిష్కరించాం. ఇప్పుడూ బహిష్కరిస్తున్నాం’ అని గ్రామస్థులు ర్యాలీ నిర్వహించి ఎన్నికల అధికారికి, తహసీల్దార్‌కి వినతి పత్రాలు అందజేశారు. కొల్వూరి శ్రీనివాస్‌, ఆవూరి సోమరాజు, ఇల్లా సత్యనారాయణ, కల్యాణ్‌, దాసరి కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T06:32:47+05:30 IST