మంచు కురిసే వేళలో..
ABN , First Publish Date - 2022-01-23T05:17:21+05:30 IST
చలి తీవ్రత పెరిగింది. దీనికి తోడు దట్టంగా మంచు కురుస్తుండడంతో ప్రజలు గజగజలాడుతున్నారు.
ఏలూరు రూరల్, జనవరి 22 : చలి తీవ్రత పెరిగింది. దీనికి తోడు దట్టంగా మంచు కురుస్తుండడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. బారెడు పొద్దెక్కినా జనం ఇళ్లల్లో నుంచి బయటకు రావడా నికి జంకుతున్నారు. శనివారం మంచు దుప్పటి కప్పేసింది. మంచు తెరలు తెరలుగా పడు తుండడంతో రహదారులు కనిపించడం లేదు. ఎదురుగా ఎవ రు ఉన్నారో కూడా తెలియని స్థాయిలో మంచు కురుస్తోంది. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు దట్టంగా మంచు అలుముకోవడంతో దారి కనపడక లైట్ల వెలుతురు లో వాహనదారులు వాహనాలు నడుపుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు చలి మంటలు వేసుకుని తమ శరీరాలను వెచ్చ పర్చుకుంటున్నారు. మరోపక్క కనువిందు చేస్తున్న మంచు దృశ్యాలను చూసి ప్రకృతి ప్రేమికులు ఫిదా అవుతున్నారు.