స్పందనకు 105 అర్జీలు

ABN , First Publish Date - 2022-06-28T05:26:25+05:30 IST

స్పందనలో అందిన ప్రతీ దరఖాస్తును నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జేసీ జేవీ మురళి అధికారులను ఆదేశించారు.

స్పందనకు 105 అర్జీలు
ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న జేసీ మురళి

భీమవరం, జూన్‌ 27 : స్పందనలో అందిన ప్రతీ దరఖాస్తును నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జేసీ జేవీ మురళి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి స్పందన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి 105 అర్జీలను స్వీకరించారు. వీటన్నింటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. డీఆర్వో కె.కృష్ణవేణి, వయో వృద్ధుల సంక్షేమ ట్రిబ్యునల్‌ మెంబరు మేళం దుర్గాప్రసాద్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏడు ..
భీమవరం క్రైం: అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ నమ్మి బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు, పిన్‌ నెంబర్‌, ఓటీపీ వివరాలు తెలిపి మోసపోవద్దని, సంబంధిత విషయాలపై బ్యాంక్‌ అధికారులను అడిగి తెలుసుకోవాలని జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్‌ అన్నారు. చినఅమిరంలోని తన  కార్యాలయం లో నిర్వహించిన స్పందనలో ఏడు ఫిర్యాదులు స్వీకరించారు.

Updated Date - 2022-06-28T05:26:25+05:30 IST