విద్యుత్ వైర్లు తగిలి గడ్డి ట్రాక్టర్ దగ్ధం
ABN , First Publish Date - 2021-04-24T04:41:31+05:30 IST
గడ్డితో వెళ్తున్న ట్రాక్టరుకు విద్యు త్ వైర్లు తాకడంతో మంటలు ఎగసి, ట్రక్కుతో సహ గడ్డి దగ్ధమైంది.
పెదవేగి, ఏప్రిల్ 23 : గడ్డితో వెళ్తున్న ట్రాక్టరుకు విద్యు త్ వైర్లు తాకడంతో మంటలు ఎగసి, ట్రక్కుతో సహ గడ్డి దగ్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెదవేగి మండలం కొప్పులవారిగూడేనికి చెందిన మాదాల సుబ్బారావు ఏడెకరాల్లోని గడ్డిని ట్రాక్టరుపై వేసుకుని గ్రామంలోకి వస్తున్నా డు. గ్రామ సమీపంల విద్యుత్ వైర్లు తాకడంతో మంటలు వ్యాపించి గడ్డికి అంటుకుని ట్రాక్టరు ట్రక్కుతో సహా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఏలూరు అగ్నిమాపక సి బ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలు మరింతగా వ్యా పించకుండా అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.70 వేల విలువైన గడ్డితో పాటు ట్రక్కు దగ్ధమయ్యాయని బా ధితుడు తెలిపాడు.