మహిళలకు రూ.119.71 కోట్లు పంపిణీ

ABN , First Publish Date - 2021-04-24T05:14:35+05:30 IST

జిలాలో 79,624 స్వయం సహాయక సంఘాలకు రూ.119.71 కోట్ల లబ్ధి చేకూరిందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు.

మహిళలకు రూ.119.71 కోట్లు పంపిణీ
మహిళలకు సున్నా వడ్డీ చెక్‌ను అందజేస్తున్న మంత్రి వనిత, కలెక్టర్‌ కార్తికేయ

ఏలూరు, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): జిలాలో 79,624 స్వయం సహాయక సంఘాలకు రూ.119.71 కోట్ల లబ్ధి చేకూరిందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీసీ ద్వారా శుక్రవారం ముఖ్యమంత్రి ప్రారంభించిన రెండో దఫా వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కార్యక్రమంలో ఆమె ఏలూరు నుంచి పాల్గొన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా రెండో ఏడాది సున్నా వడ్డీ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా సహా, ఆమె మహిళా ప్రతినిధులకు సున్నా వడ్డీ చెక్కును పంపిణీ చేశారు. వీసీలో డీఆర్‌డీఏ పీడీ ఉదయభాస్కర్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T05:14:35+05:30 IST