తొమ్మిదో వార్డుకు రెండు నామినేషన్లు
ABN , First Publish Date - 2021-03-07T05:19:03+05:30 IST
పెరుగుగూడెం పంచాయతీ పరిధిలోని 9వ వార్డుకు శని వారం చివరి రోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.
దెందులూరు, మార్చి 6: పెరుగుగూడెం పంచాయతీ పరిధిలోని 9వ వార్డుకు శని వారం చివరి రోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ– టీడీపీ ఒప్పందం లో భాగంగా టీడీపీ మద్దతు అభ్యర్థి గతంలో నామినేషన్ తిరస్కరణకు గురైనా పాముల రాఽధాకృష్ణ కుమారుడు పాముల రామాంజనేయులు నామినేషన్ దాఖాలు చేశాడు. డమ్మీ అభ్యర్థిగా మరొకరు నామినేషన్ వేశారు. ఆదివారం నామినేషన్ల పరిశీలన అనం తరం రామాంజనేయులు నామినేషన్ అంతా సక్రమంగా ఉంటే డమ్మీ అభ్యర్థి నామినేషన్ను ఉపసంహరించుకోనున్నారు. ఈక్రమం లో తొమ్మిదో వార్డు దాదాపు ఏకగ్రీవం అయినట్టే.