India Vs Australia: చిత్తడిగా మైదానం.. టాస్ వాయిదా
ABN , First Publish Date - 2022-09-24T00:48:50+05:30 IST
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇక్కడి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో
నాగ్పూర్: మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇక్కడి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రెండో మ్యాచ్ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. గత రాత్రి ఇక్కడ వర్షం పడడంతో మైదానం చిత్తడిగా మారింది. ఫలితంగా ఇప్పటి వరకు టాస్ పడలేదు. వర్షం పడుతుండడంతో పిచ్పై కవర్లు కప్పినప్పటికీ అవుట్ఫీల్డ్లో అక్కడక్కడా తేమ ఎక్కువగా ఉంది. దీంతో మైదానాన్ని సిద్ధం చేసేందుకు స్టేడియం సిబ్బంది రంగంలోకి దిగారు. అన్నీ అనుకూలిస్తే మరికాసేపట్లో టాస్ పడే అవకాశం ఉంది.
మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భాగంగా మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. టీమిండియా భారీ స్కోరు సాధించినప్పటికీ ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాల్లో చేతులెత్తేసిన భారత్కు పరాజయం తప్పలేదు. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో కనుక భారత జట్టు విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతుంది. అప్పుడు సిరీస్ ఫలితం హైదరాబాద్ మ్యాచ్కు మారుతుంది. ఒకవేళ ఆస్ట్రేలియా కనుక ఈ మ్యాచ్లో గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. అప్పుడు హైదరాబాద్ మ్యాచ్ నామమాత్రం అవుతుంది.