ప్రభుత్వ భూమిని కాజేసిన ఉద్యోగులను తొలగించాలి
ABN , First Publish Date - 2021-07-25T06:08:55+05:30 IST
పీలేరు పరిసరాల్లో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి భవనాలను నిర్మించుకుని అమ్ముకున్న ప్రభుత్వ ఉద్యోగులను తక్షణం విధుల నుంచి తొలగించాలని సీపీఐ జిల్లా నాయకుడు టిఎల్ వెంకటేష్ డిమాండ్ చేశారు.
పీలేరు, జూలై 24: పీలేరు పరిసరాల్లో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి భవనాలను నిర్మించుకుని అమ్ముకున్న ప్రభుత్వ ఉద్యోగులను తక్షణం విధుల నుంచి తొలగించాలని సీపీఐ జిల్లా నాయకుడు టిఎల్ వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాధ్యత గల అధికారులు కబ్జాదారులతో చేతులు కలిపి ప్రభుత్వ భూమిని కాజేయడం దుర్మార్గమన్నారు. ఇలాంటి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలన్నారు.