ప్రకృతి వనాలు ప్రారంభం కావాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2020-11-20T10:30:51+05:30 IST
జిల్లాలోని అన్ని గ్రామా ల్లో వారం రోజుల్లోగా పల్లె ప్రకృతి వనాలు ప్రారంభంకావాలని కలె క్టర్ హరిత ఆదేశించా రు.
వరంగల్ రూరల్ క ల్చరల్, నవంబరు 19: జిల్లాలోని అన్ని గ్రామా ల్లో వారం రోజుల్లోగా పల్లె ప్రకృతి వనాలు ప్రారంభంకావాలని కలె క్టర్ హరిత ఆదేశించా రు. గురువారం డంపిం గ్ యార్డు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నర్సరీ తదితర అంశాల మీద ఎం పీడీవోలు, ఎంపీపీలతో రివ్యూ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ల్యాం డ్ ఐడెంటిఫై అయిన గ్రామాల్లో గ్రౌండింగ్ ప్లాంటేషన్ పూర్తి కావాలన్నారు. స్థలం గుర్తించడంలో ఇబ్బంది ఉన్న చోట తహసీల్దార్, ఆర్డీవోలతో సమన్వయం చేసుకో వాలన్నారు. డంపింగ్ యార్డుల నిర్మాణాలు పూర్తి అయ్యాయన్నారు. పెండింగ్లో ఉన్న మరుగుదొడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. డంపింగ్ యార్డుల్లో టాయిలె ట్ల నిర్మాణం వారంలోగా పూర్తి చేయాలని, డిసెంబరు 20వరకు వైకుంఠధామాలు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.