డీఈవో ఆకస్మిక తనిఖీలు
ABN , First Publish Date - 2020-11-20T10:33:09+05:30 IST
ఆన్లైన్ తరగతుల ని ర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి గురువారం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు.
వరంగల్ రూరల్ కల్చరల్, నవంబరు 19: ఆన్లైన్ తరగతుల ని ర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి గురువారం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. సంగెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల్లో నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగ తులు పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు వింటున్న గృహాలను డీఈవో సందర్శించి బోధనను తిలకిం చారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కె. శ్రీనివాస్, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు నవీన్రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీధర్రెడ్డి, ప్రకాష్, ఆజీ నూరానీ, సరోజ పాల్గొన్నారు.
సైన్స్, మ్యాథ్స్ కిట్ల అందజేత
జిల్లాలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు గురువారం మ్యా థ్స్, సైన్స్ కిట్లను ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి వాసం తి అందజేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో ఉన్నత పాఠశాలలకు 38సైన్స్, 76 మ్యాథ్స్ కిట్లు, ప్రాథమికోన్నత పాఠశాలలకు 68సైన్స్, 59మ్యాథ్స్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.