వరంగల్రూరల్ జిల్లా
ABN , First Publish Date - 2020-11-20T10:28:01+05:30 IST
ఆర్థిక ఇబ్బందులతో గృహిణి బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాజీతండా లో చోటుచేసుకుంది.
ఆర్థిక ఇబ్బందులతో గృహిణి ఆత్మహత్య
ఖానాపురం, నవంబరు 19: ఆర్థిక ఇబ్బందులతో గృహిణి బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాజీతండా లో చోటుచేసుకుంది. ఎస్సై సాయిబాబు కథనం ప్రకారం నాజీతండాకు చెందిన భూక్య బీర్య పెద్ద కుమార్తె బోడ అమల(28)ను చెన్నారావుపేట మండలం దేవలతండాకు చెందిన బోడ హరికి ఇచ్చి తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. తమకున్న రెండెకరాల్లో సాగుచేసుకుంటూ జీవిస్తున్నారు. కొన్నేళ్లుగా వ్యవసాయంలో దిగుబడిరాక పోవడంతో ఆర్థికంగా నష్టపోయారు. దీంతో మనస్తాపానికి గురైన అమలకు సర్ధి చెప్పేందుకు తల్లిదండ్రులు నాజీతండాకు తీసుకువచ్చారు. ఈక్రమంలో ఇంట్లో ఎవరులేని సమ యంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం మృతురాలి తం డ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.