Cruelty husband: అప్పులు తీర్చడం కోసం భార్యనే బలిపశువును చేశాడు. కొందరు యువకులతో కలిసి అతడు చేసిన నిర్వాకం..
ABN , First Publish Date - 2022-08-07T21:28:58+05:30 IST
జల్సాలకు అలవాటు పడిన చాలా మంది.. ఎంతటి దారుణాలు చేయడానికైనా వెనుకాడరు. కొందరు తాహతుకు మించి అప్పులు (debts) చేసి, ఎలా తీర్చాలో తెలీక.. చివరకు చేయరాని..
జల్సాలకు అలవాటు పడిన చాలా మంది.. ఎంతటి దారుణాలు చేయడానికైనా వెనుకాడరు. కొందరు తాహతుకు మించి అప్పులు (debts) చేసి, ఎలా తీర్చాలో తెలీక.. చివరకు చేయరాని తప్పులన్నీ చేస్తుంటారు. ఇంకొందరైతే.. తాము చేసిన తప్పులకు ఇంట్లో వారిని బలిపశువులను చేస్తుంటారు. ఇలాంటి శాడిస్టుల గురించి తరచూ వార్తలు వినపడుతూనే ఉంటాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో (Madhya Prades) ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అప్పుల ఊబి నుంచి బయటపడడం కోసం చివరకు కట్టుకున్న భార్యనే బలిపశువును చేశాడు. చివరకు అతడు చేసిన నిర్వాకం.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్గఢ్లోని కురావర్ ప్రాంత పరిధిలో బద్రీప్రసాద్ అనే వ్యక్తి.. భార్య పూజా మీనాతో కలిసి నివాసం ఉంటున్నాడు. వివాహమైన కొన్నాళ్లకు బద్రీప్రసాద్.. మద్యానికి (Alcoholic) అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో వివిధ అవసరాల నిమిత్తం చాలా మంది వద్ద సుమారు రూ.40నుంచి రూ.50లక్షల మేర అప్పులు చేశాడు. ఇటీవల రుణదాతల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. అప్పులను ఎలా తీర్చాలనే విషయంపై వివిధ రకాలుగా ఆలోచించాడు. చివరకు దారుణమైన పథకం పన్నాడు. భార్య పేరు మీద ఇన్సూరెన్స్ (Inurance) చేసి, తద్వారా వచ్చిన మొత్తంతో అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నాడు. బీమా సొమ్ము త్వరగా రావాలంటే ఏం చేయాలనే అంశంపై సోషల్ మీడియాలో (Social media) సెర్చ్ చేశాడు. చివరకు, బీమా చేసిన అనంతరం భార్యను హతమార్చి, తద్వారా లబ్ధి పొందాలని కుట్రపన్నాడు.
బావ Birthday వేడుకలకు వెళ్తుండగా.. భర్త ఎదుటే భార్యను చేయి పట్టుకున్న యువకులు.. చివరకు అంతా చూస్తుండగా..
భార్య పేరు మీద రూ.35లక్షలకు బీమా చేశాడు. తర్వాత కొందరు యువకులకు రూ.5లక్షల సుఫారీ మాట్లాడుకుని, తన భార్యను హతమార్చేలా ఒప్పందం చేసుకున్నాడు. పథకం ప్రకారం జూలై 26 భార్యను బైకుపై ఎక్కించుకుని బయటికి తీసుకెళ్లాడు. మన జోడ్ అనే ప్రాంత సమీపంలో బైకు ఆపి.. భార్యను పక్కన కూర్చోబెట్టి, బైకు రిపేరు చేస్తున్నట్లుగా నటించాడు. అప్పటికే అక్కడ కాపు కాచి ఉన్న నిందితులు.. ఆమెను తుపాకీతో కాల్చి (Gun firing) చంపారు. తర్వాత అంతా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కుట్రకోణం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు మృతురాలి భర్త ద్రీప్రసాద్ను, హునర్పాల్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న గోలు, షకీర్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.