Wife Killed Husband: భర్తను చంపి బాత్రూంలోనే మృతదేహాన్ని రెండ్రోజుల పాటు దాచిన భార్య.. వాసన వస్తోందని ఆమె చేసిన పనితో..

ABN , First Publish Date - 2022-08-19T22:29:34+05:30 IST

అతడికి అప్పటికే భార్య, పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవల రెండో వివాహం (Second marriage) చేసుకున్నాడు. అదే అతడి పాలిట మృత్యువుగా మారింది. దీంతో అప్పటిదాకా సవ్యంగా సాగిన..

Wife Killed Husband: భర్తను చంపి బాత్రూంలోనే మృతదేహాన్ని రెండ్రోజుల పాటు దాచిన భార్య.. వాసన వస్తోందని ఆమె చేసిన పనితో..

అతడికి అప్పటికే భార్య, పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవల రెండో వివాహం (Second marriage) చేసుకున్నాడు. అదే అతడి పాలిట మృత్యువుగా మారింది. దీంతో అప్పటిదాకా సవ్యంగా సాగిన అతడి జీవితం.. అర్ధాంతరంగా ముగిసిపోయింది. భర్తను చంపిన మహిళ.. మృతదేహాన్ని రెండు రోజుల పాటు బాత్రూంలోనే ఉంచింది. అయితే వాసన వస్తోందని చివరకు ఆమె చేసిన పనితో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాష్ట్రం బిలాస్‌పూర్‌‌లోని సర్కండ పరిధి చంటిదిహ్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్ కమల్ (38)కు భార్య, పిల్లలు ఉన్నారు. రోజూ కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆనందంగా సాగుతున్న వీరి సంసారంలో అనుకోని సమస్యలు వచ్చిపడ్డాయి. సయ్యద్ ఇటీవల సుమిత్ర అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. సివిల్ లైన్స్ ప్రాంతంలోని జర్హాభతా అనే ప్రాంతంలో ఆమెతో కలిసి ఉండేవాడు. సుమిత్రకు అప్పటికే భర్త, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వారికి దూరంగా ఉంటోంది. ఇలా ఉండగా కొద్ది రోజులుగా సుమిత్ర.. తన మొదటి భర్త, కుమారుడిని చూసేందుకు వెళ్లి వస్తూ ఉండేది.

ఆరు నెలల క్రితం అస్వస్థతకు గురైన భర్త.. ఇటీవల చెల్లెలి ఇంటికి వెళ్తున్నానని చెప్పిన భార్య.. చివరకు చేసిన పని..


అయితే ఆమె అలా వెళ్లడం సయ్యద్‌కు నచ్చలేదు. దీంతో ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆగస్టు 12న రాత్రి సయ్యద్.. మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మొదటి భర్తతో మాట్లాడవద్దంటూ భార్యతో గొడవపడ్డాడు. అప్పటికే విసిగిపోయిన సుమిత్ర.. తన కొడుకు, మొదటి భర్త తదితరులతో కలిసి సయ్యద్‌ను అంతమొందించాలని నిర్ణయించుకుంది. 12న రాత్రి అంతా కలిసి సయ్యద్‌ను హత్య చేశారు. మృతదేహాన్ని రెండు రోజుల పాటు బాత్రూంలోనే దాచింది.

గ్రామం ఖాళీ చేసిన యువకుడి కుటుంబం.. విషయం తెలిసి వీడియో రిలీజ్ చేసిన యువతి.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


సయ్యద్ కనిపించికపోవడంతో మొదటి భార్య, పిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దుర్వాసన వస్తోందని సయ్యద్ మృతదేహాన్ని ఓ కాలువలో పడేశారు. స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడి జేబులో ఉన్న ఆధార్ కార్డు ద్వారా నిందితుడిని గుర్తించారు. అనంతరం సుమిత్రను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సుమిత్రతో పాటూ మిగతా నిందితులను అరెస్ట్ చేసి, కేసులు నమోదు చేశారు.

Attack on girl: ఆలయం నుంచి వస్తున్న బాలిక వెనుకే వెళ్లాడు.. మర్కెట్ దగ్గరికి రాగానే వెనుక వైపు నుంచి ఒక్కసారిగా..



Updated Date - 2022-08-19T22:29:34+05:30 IST