15ఏళ్ల తర్వాత భార్యకు విడాకులిచ్చాడు.. అయినా రోజూ ఆమెపైనే నిఘా.. ఓ రోజు ఒంటిరిగా వెళ్తుంటే సడన్‌గా అడ్డుకుని..

ABN , First Publish Date - 2022-01-31T00:21:47+05:30 IST

వారిద్దరూ ప్రేమించుకున్నారు. విడిపోకూడదనే ఉద్దేశంతో పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి సమస్యలూ లేకుండా 15ఏళ్లు కలిసిమెలసి జీవించారు. ఇధ్దరు పిల్లలు కూడా పుట్టారు. అనూహ్యంగా వారి సంసారంలో..

15ఏళ్ల తర్వాత భార్యకు విడాకులిచ్చాడు.. అయినా రోజూ ఆమెపైనే నిఘా.. ఓ రోజు ఒంటిరిగా వెళ్తుంటే సడన్‌గా అడ్డుకుని..
ప్రతీకాత్మక చిత్రం

వారిద్దరూ ప్రేమించుకున్నారు. విడిపోకూడదనే ఉద్దేశంతో పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి సమస్యలూ లేకుండా 15ఏళ్లు కలిసిమెలసి జీవించారు. ఇధ్దరు పిల్లలు కూడా పుట్టారు. అనూహ్యంగా వారి సంసారంలో గొడవలు మొదలయ్యాయి. అప్పటిదాకా అన్యోన్యంగా ఉన్న దంపతులు.. ఉన్నట్టుండి బద్ధ శత్రువుల్లా మారారు. చివరికి ఇద్దరూ విడాకులు తీసుకుని, ఎవరి జీవితం వారు గడుపుతున్నారు. అయితే భర్త మాత్రం రోజూ మాజీ భార్యపై నిఘా పెట్టడం మొదలెట్టాడు. ఓ రోజు ఆమె ఒంటరిగా వెళ్తుండగా సడన్‌గా అడ్డుకుని పొలాల్లోకి లాక్కెళ్లాడు. అతడు చేసిన నిర్వాకంతో గ్రామస్తులంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


కర్ణాటక మండ్య తాలూకా రాగిముద్దనహళ్లి గ్రామానికి చెందిన సురేష్, షాలిని (32) దంపతులు. వీరికి 15 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒకరినొకరు ప్రేమించుకున్న వీరు.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండడంతో సంసారం కూడా సవ్యంగా సాగింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమోగానీ ఇటీవల వీరి కుటుంబంలో సమస్యలు తలెత్తాయి. అత్త, కోడలికి సరిపోకపోవడంతో పాటూ దంపతులు మధ్య కూడా తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో భార్యపై తరచూ దాడికి పాల్పడేవాడు. గొడవలు రోజురోజుకూ పెరుగుతుండడంతో విసిగిపోయిన షాలిని, ఐదేళ్ల క్రితం విడాకులు తీసుకుంది. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నా సురేష్ మాత్రం.. రోజూ భార్యపైనే నిఘా పెట్టేవాడు.

వరకట్నం నిరాకరించిన వరుడు.. వధువు కుటుంబీకులకు ఎలాంటి నిబంధన విధించాడో తెలుసా..


ఈ క్రమంలో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరి జీవితం గడుపుతున్న ఆమెపై పగ పెంచుకున్నాడు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన సురేష్.. రోజూ విధులకు పోతూ, వస్తూ షాలినీకి తెలీకుండా గమనించడం మొదలెట్టాడు. కూలి పనికి వెళ్లి పిల్లలను పోషించుకుంటున్న షాలిని.. రోజూ లాగే శుక్రవారం కూడా పనికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చే క్రమంలో నిర్మానుష్య ప్రదేశంలో ఆమెకు అతను అమాంతం ఎదురుపడ్డాడు. బలవంతంగా పొలాల్లోకి లాక్కెళ్లాడు. అప్పటికే ఆమెపై పట్టలేని కోపంతో ఉన్న సురేష్.. ఒక్కసారిగా కత్తి తీసుకుని ఆమె గొంతు కోసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి సడన్‌గా అదృశ్యం.. అంతా కంగారుపడుతుండగా ఇంతలో ఫోన్.. చివరికి అసలు విషయం తెలిసి..

Updated Date - 2022-01-31T00:21:47+05:30 IST