ఇలాంటి అత్త కూడా ఉంటుందా.! పెళ్లయిన ఆరు నెలలకే కొడుకు చనిపోయినా.. కోడలిని ఇంట్లోనే ఉంచుకుని.. చివరకు ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-01-28T00:42:05+05:30 IST

కోడళ్లను కన్న కూతుళ్లలాగా చూసుకునే అత్తగారు కూడా ఉంటారు. రాజస్థాన్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. పెళ్లయిన ఆరు నెలలకే కొడుకు చనిపోయాడు. ఆమె స్థానంలో వేరే వారు ఉండుంటే..

ఇలాంటి అత్త కూడా ఉంటుందా.! పెళ్లయిన ఆరు నెలలకే కొడుకు చనిపోయినా.. కోడలిని ఇంట్లోనే ఉంచుకుని.. చివరకు ఏం చేసిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

అత్తాకోడళ్ల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుందనేది అందరికీ తెలిసిందే. కోడళ్లను వేధించే అత్తలు, అలాగే అత్తగారిని వేధించే కోడళ్లు చాలా మందే ఉంటారు. కట్నం విషయంలో కోడళ్లను వేధించే అత్తలు ఉన్నట్లుగానే.. కోడళ్లను కన్న కూతుళ్లలాగా చూసుకునే అత్తగారు కూడా ఉంటారు. రాజస్థాన్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. పెళ్లయిన ఆరు నెలలకే కొడుకు చనిపోయాడు. ఆమె స్థానంలో వేరే వారు ఉండుంటే.. నష్ట జాతకురాలంటూ కోడలిని వేధించేవారు. కానీ ఈ అత్త మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళితే...


రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో నివాసం ఉంటున్న కమలా దేవి, దిలావర్ దంపతులకు శుభం అనే కుమారుడు ఉన్నాడు. పెళ్లి వయసు రావడంతో సంబంధాలు చూసి.. ఎట్టకేలకు 2016 మేలో సునీత అనే యువతితో వివాహం చేశారు. వివాహం అనంతరం శుభం.. డాక్టర్ కోర్సు పూర్తి చేసేందుకు కిర్గిస్థాన్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో అనుకోకుండా 2016 నవంబర్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌తో అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ వార్త విని అతడి భార్యతో పాటూ తల్లిదండ్రులంతా దిగ్భ్రాంతి చెందారు. వివాహమై ఆరు నెలలు కూడా గడవక ముందే కూతురు వితంతువుగా మారడంతో ఆమె తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. మరోవైపు కొడుకు మరణవార్తను జీర్ణించుకోలేని యువకుడి తల్లిదండ్రులు కూడా కన్నీరుమున్నీరయ్యారు. ఈ స్థానంలో వేరే అత్త ఉండుంటే కోడలు నష్టజాతకురాలంటూ వేధింపులు మొదలెట్టేది. అయితే ఈమె మాత్రం కోడలిని పల్లెత్తు మాట కూడా అనలేదు.

తీరా మూడు ముళ్లు వేశాక వధువు రివర్స్.. ఆ ఒక్క కారణం చూపి వద్దంటే వద్దంది.. చివరకు ఏమైందంటే..


కోడలిని కన్న కూతురు కంటే ఎక్కువగా ప్రేమించడం మొదలెట్టారు. తమ ఇంట్లోనే ఉంచుకొని ఉన్నత చదువులు చదివించారు. వారి సహకారంతో సునీత.. ప్రిన్సిపాల్ జాబ్ సంపాదించింది. దీంతో ఎంతో సంతోషించిన అత్త.. అంతటితో ఆగకుండా ఆమెకు మళ్లీ పెళ్లి సంబంధాలు చూడడం మొదలెట్టింది. మంచి వరుడిని చూసి, దగ్గరుండి ఘనంగా పెళ్లి జరిపించింది. దీంతో సునీత తల్లిదండ్రులతో పాటూ చుట్టుపక్కల వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. సునీత అత్తపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

పేరుకు పెళ్లి కారు.. లోపల ఆడవాళ్లను ఎక్కించి.. వారు చేసిన పని తెలిస్తే అవాక్కవుతారు

Updated Date - 2022-01-28T00:42:05+05:30 IST