ప్రధాని వ్యాఖ్యలపై జగన్ ఏం సమాధానం చెబుతారు: ఆనంద్ సాగర్
ABN , First Publish Date - 2022-05-01T00:50:32+05:30 IST
ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రధాని
అమరావతి: ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ ప్రశ్నించారు. రోడ్ల సెస్సు, వాహనాల సెస్సు పేరుతో ఏపీ ప్రభుత్వమే చమురు ధరలు పెంచిందని చెప్పిన మోదీ మాటలు నిజమా కాదా అని ఆయన నిలదీశారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ ఛార్జీలు, పన్నుల బాదుళ్లతో ప్రజలను సీఎం చావ బాదుతున్నాడని ఆయన మండిపడ్డారు. పాండిచ్చేరి, కర్ణాటకతో పోలిస్తే ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.15 అధికంగా ఉందని ఆయన తెలిపారు.