మీరేం చేశారో చెప్పాలి!

ABN , First Publish Date - 2021-02-28T03:44:29+05:30 IST

:ఫ్లైఓవర్‌ బ్రిడ్జికి నిధులు మంజూరయ్యాయని పలుసార్లు ప్రకటించిన ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు ఇప్పటి వరకు ప్రారంభం కాకున్నా ఎందుకు మౌనం వహించారని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరు హరిచంద్రారెడ్డి ప్రశ్నించారు.

మీరేం చేశారో చెప్పాలి!
మాట్లాడుతున్న వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరు హరిచంద్రారెడ్డి

ఎమ్మెల్యేకు హరిచంద్రారెడ్డి సవాల్‌

గూడూరు, ఫిబ్రవరి 27:ఫ్లైఓవర్‌ బ్రిడ్జికి నిధులు మంజూరయ్యాయని పలుసార్లు  ప్రకటించిన ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు ఇప్పటి వరకు ప్రారంభం కాకున్నా ఎందుకు మౌనం వహించారని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరు హరిచంద్రారెడ్డి ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 21 నెలల కాలంలో నియోజకవర్గానికి ఆయన ఏంచేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్థానిక తూర్పువీధిలోని తన నివాసంలో శనివారం ఆయన మాట్లాడారు. గూడూరు అభివృద్ధికి అంతగా పాటుపడుతుంటే మున్సిపాలిటీలో విలీనమైన పంచాయతీల్లోని  నాయకులు కోర్టుకు వెళ్లకుండా ఎందుకు కట్టడి చేయలేదన్నారు. గూడూరు మున్సిపాలిటీ గ్రేడ్‌-1 స్థాయికి చేరుకోవడంలో తమ కృషి కూడా ఉందన్నారు. నాయుడుకాలువ, నల్లకాలువ అభివృద్ధికి తన సొంత నిధులు వెచ్చించామన్నారు. ఇప్పటికే గూడూరు అభివృద్ధిపై 30 సార్లకు పైగా ఎమ్మెల్యేను కలిసి చర్చించామన్నారు. తన సంపాదనలో కొంత గూడూరు అభివృద్ధికి వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. 

Updated Date - 2021-02-28T03:44:29+05:30 IST