పెళ్లి రోజును మర్చిపోయిన భర్త.. భార్య చేసిన పనికి షాక్.. చివరకు అసలు విషయం తెలిసి..!
ABN , First Publish Date - 2022-05-29T17:27:14+05:30 IST
అతను బ్యాంక్ లో మేనేజర్ గా పని చేస్తున్నాడు.. ఐదేళ్ల క్రితం ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
అతను బ్యాంక్ లో మేనేజర్ గా పని చేస్తున్నాడు.. ఐదేళ్ల క్రితం ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. మూడేళ్లు ఇద్దరూ బాగానే కలిసి మెలిసి జీవించారు.. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి.. ఇటీవల ఆ భర్త తమ పెళ్లి రోజును మర్చిపోయాడు.. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య.. భర్తపై చేయిచేసుకుంది.. తనకు విడాకులు కావాలని పంచాయితీ పెట్టింది.. రాజస్థాన్ లోని ఆళ్వార్ లో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
Viral Video: పూల దండ వేసుకోనంటూ మొండిపట్టు పట్టిన వధువు.. వరుడికి విసుగొచ్చి చేసిన ఒక్క పనితో..
ఆళ్వార్ కు చెందిన అభినవ్ ఐదేళ్ల క్రితం కవిత అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్ల పాటు ఇద్దరూ కలిసి మెలిసి జీవించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఇటీవల అభినవ్ తమ పెళ్లి రోజును మర్చిపోయాడు. దీంతో కవితకు చిర్రెత్తుకొచ్చింది. డ్యూటీకి వెళ్లేందుకు రెడీ అవుతున్న భర్తపై చేయి చేసుకుంది. తీవ్రంగా షాకైన అభినవ్ కూడా భార్యను కొట్టాడు. దీంతో తనకు విడాకులు కావాలని కవిత పంచాయితీ పెట్టింది. కవిత తల్లిదండ్రులు కూడా కూతురు ప్రవర్తన చూసి షాకయ్యారు.
కవిత మానసిక సమస్యతో బాధపడుతుందేమోననే అనుమానంతో ఆమెను అభినవ్ ఓ సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాడు. కవితను పరీక్షించిన డాక్టర్ అసలు విషయం చెప్పాడు. కవిత బై పోలార్ డిజార్డర్ తో బాధపడుతున్నట్టు తేల్చాడు. బై పోలార్ డిజార్డర్ అంటే తరచుగా ఒక వ్యక్తి మూడ్ మారిపోతుంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో బై పోలార్ డిజార్డర్ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయట. ప్రస్తుతం కవిత డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స అందుకుంటోంది.