ఇంకెప్పుడు ఆదుకుంటారు!?

ABN , First Publish Date - 2021-07-24T04:36:02+05:30 IST

వరుస వర్షాలతో జిల్లాప్రజలు అల్లాడుతుంటే మంత్రి అల్లోల మాత్రం కల్లబొల్లి మాట లు చెబుతున్నారని.. ఇంకెప్పుడు బాధితులను ఆదుకుంటారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి మండిపడ్డారు.

ఇంకెప్పుడు ఆదుకుంటారు!?
సోన్‌ మండలంలో పర్యటిస్తున్న ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి

మంత్రికి మహేశ్వర్‌రెడ్డి సూటిప్రశ్న 

సోన్‌, జూలై 23 : వరుస వర్షాలతో జిల్లాప్రజలు అల్లాడుతుంటే మంత్రి అల్లోల మాత్రం కల్లబొల్లి మాట లు చెబుతున్నారని.. ఇంకెప్పుడు బాధితులను ఆదుకుంటారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం సోన్‌లో పర్యటించిన ఆయన.. పంటనష్టపోయిన రైతులను ఓదార్చారు. వెంటనే బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-07-24T04:36:02+05:30 IST