దేశంలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్-19 కేసులు..

ABN , First Publish Date - 2022-04-20T22:26:43+05:30 IST

దేశంలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్-19 కేసులు..

దేశంలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్-19 కేసులు..

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. భారతదేశంలో కొత్తగా 2,067 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. భారతదేశంలో 12,340 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళలో అత్యధికంగా 2,432 కేసులు ఉన్నాయి. ఢిల్లీలో 1,947, కర్ణాటకలో 1,529, అస్సాంలో 1,351, హర్యానాలో 1,125 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరోనా వైరస్ తగ్గిపోయిందని భావించవద్దని ప్రజలకు సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మోదీ కోరారు.

Updated Date - 2022-04-20T22:26:43+05:30 IST