మరుగుదొడ్డి కోసం గుంత తవ్వుతుండగా... మధ్యలో ఊహించని దృశ్యంతో కళ్లు జిగేల్.. చివరకు..

ABN , First Publish Date - 2022-08-20T01:25:52+05:30 IST

గుప్త నిధుల (hidden treasures) కోసం కొందరు అక్రమంగా తవ్వకాలు చేస్తుంటారు. కొందరైతే పురాతన ఆలయాలను.. నిధుల పేరుతో కూల్చేయడం చూస్తూనే ఉన్నాం. పురతాన కాలంలో..

మరుగుదొడ్డి కోసం గుంత తవ్వుతుండగా... మధ్యలో ఊహించని దృశ్యంతో కళ్లు జిగేల్.. చివరకు..

గుప్త నిధుల (hidden treasures) కోసం కొందరు అక్రమంగా తవ్వకాలు చేస్తుంటారు. కొందరైతే పురాతన ఆలయాలను.. నిధుల పేరుతో కూల్చేయడం చూస్తూనే ఉన్నాం. పురతాన కాలంలో విలువైన ఆభరాణాలు, నగలు తదితరాలను దొంగల బారి నుంచి రక్షించుకునేందుకు భూమిలో పాతిపెడుతుంటారు. తవ్వకాలు జరిగే సమయంలో కొన్నిసార్లు నిధులు బయటపడ్డాయనే వార్తలు వింటూ ఉంటాం. కంబోడియా ప్రావిన్స్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కొడుకుతో కలిసి మరుగుదొడ్డి కోసం గుంతను తవ్వుతున్నారు. మధ్యలో ఒక్కసారిగా వారి కళ్లు జిగేల్‌మని మెరిశాయి. చివరకు ఏం జరిగిందంటే..


కాంబోడియా ప్రావిన్స్‌ (Province of Cambodia) వాయువ్య ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతంలో సబోయున్ రాన్ అనే 42 ఏళ్ల వ్యక్తి.. మరుగుదొడ్డి కోసం కొడుకుతో కలిసి గుంత తవ్వుతున్నాడు. రెండు మీటర్లు తవ్వగానే వారికి నీలి రంగులో రాయి కనిపించింది. దీంతో ఒక్కసారిగా వారు షాక్ అయ్యారు. మరింత తవ్వగా మొత్తం నాలుగు విగ్రహాలు (idols) బయటపడ్డాయి. అవి పురాతన కాంస్య విగ్రహాలుగా గుర్తించారు. ఈ వార్త అందరికీ తెలిసిపోవడంతో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలించిన పురావస్తు శాస్త్రవేత్తలు.. ఆ విగ్రహాలు 10వ లేదా 11వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు. వాటిని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Viral Video: ఓ వైపు వర్షం.. మరో వైపు వరద.. మధ్యలో నడి రోడ్డుపై ఈ పెద్దాయన ఏం చేస్తున్నాడో చూడండి..



Updated Date - 2022-08-20T01:25:52+05:30 IST