Telangana రైతులను పంజాబ్ CM ఆదుకుంటారా?: దాసోజు శ్రవణ్

ABN , First Publish Date - 2022-05-20T23:42:20+05:30 IST

పంజాబ్ రైతులను ఆదుకోడానికి సీఎం కేసీఆర్ పంజాబ్ వెళ్తే.. మరి తెలంగాణ రైతులను పంజాబ్ ముఖ్యమంత్రి ఆదుకుంటారా ? అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. సీఎం

Telangana రైతులను పంజాబ్ CM ఆదుకుంటారా?: దాసోజు శ్రవణ్

Hyderabad: పంజాబ్ రైతులను ఆదుకోడానికి సీఎం కేసీఆర్ పంజాబ్ వెళ్తే.. మరి తెలంగాణ రైతులను పంజాబ్ ముఖ్యమంత్రి ఆదుకుంటారా ? అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కేంద్ర రాజకీయల్లో స్థానం కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే 194 జీవో ప్రకారం.. కేవలం వెయ్యి మందికి మాత్రమే చెల్లించి, మిగతా 7 వేల మంది కుటుంబాల్లో మన్ను కొట్టారని విమర్శించారు. వడ్ల కొనుగోలు ప్రారంభమై 45 రోజులయితే, ఇంకా 40 శాతం కూడా కొనలేదని చెప్పారు. రైతు భీమా రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. 2020 వరదల్లో పంటలు నష్టపోయిన రైతులకు  నష్టపరిహారం చెల్లించలేదన్నారు. నెల రోజులు పాటు తమ పార్టీ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.

Updated Date - 2022-05-20T23:42:20+05:30 IST