ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా కలిసి పనిచేయాలి : బాలు

ABN , First Publish Date - 2022-05-20T05:47:12+05:30 IST

కాంగ్రెస్‌ అధిష్టానం దేవరకొండ నియోజకవర్గ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేసినా అభ్యర్ధి గెలుపునకు సమష్టిగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ అన్నారు.

ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా కలిసి పనిచేయాలి : బాలు
సమావేశంలో అభివాదం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

దేవరకొండ, మే 19: కాంగ్రెస్‌ అధిష్టానం దేవరకొండ నియోజకవర్గ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేసినా అభ్యర్ధి గెలుపునకు సమష్టిగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ అన్నారు. దేవరకొండలో గురువారం జరిగిన కాం గ్రెస్‌ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశాలమేరకు వరంగల్‌ డిక్లరేషన్‌లో పార్టీ ఆదేశించిన విధంగా ఈనెల 21 నుంచి జూన్‌ 21వరకు నియోజకవర్గంలోని గ్రామ, గ్రామాన రైతు రచ్చబండ కార్య క్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ఎస్టీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు రమావత్‌ జగన్‌లాల్‌నాయక్‌, కాంగ్రెస్‌ ఆదివాసి జాతీయ కోఆర్డినేటర్‌ నేనావత్‌ కిషన్‌నాయక్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాయకులందరూ సమష్టిగా పనిచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు. నాయకులు మాట్లాడుతుండగా ప్రొటో కాల్‌ పాటించడంలేదని యువజన కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీధర్‌నాయక్‌  వేదిక వద్దకు వచ్చి మాట్లాడారు. నాయకుల ప్రసంగాలకు ఆటంకగడంతో నాయ కులు వచ్చి ఆయనకు నచ్చచెప్పారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శులు సిరా జ్‌ఖాన్‌, వేణుధర్‌రెడ్డి, వడ్త్య రమేష్‌నాయక్‌, జాల నర్సింహరెడ్డి, డాక్టర్‌ రవికుమార్‌, నాయిని మాధవరెడ్డి, లోకసాని శ్రీధర్‌రెడ్డి, ముక్కమళ్ల వెంకటయ్యగౌడ్‌, తిప్పర్తి రుక్మారెడ్డి, నాగేశ్వర్‌రావు, దూదిపాల రేఖ శ్రీధర్‌రెడ్డి, కొర్ర రాంసింగ్‌ పాల్గొన్నారు.  


Updated Date - 2022-05-20T05:47:12+05:30 IST