AP News: అసలు ఆ నిర్ణయం ఎవరిది? : సొము వీర్రాజు

ABN , First Publish Date - 2022-10-07T23:54:48+05:30 IST

అమరావతి : బీజేపీ ఎపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణపై విరుచుకుపడ్డారు. దేవాదాయ శాఖ కాణిపాకంలో వినాయకుడి అభిషేకం టిక్కెట్ ధర పెంచేందుకు అభిప్రాయ సేకరణ చేయలేదని మంత్రి చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఎవరికీ తెలియకుండా అభిప్రాయ సేకరణకు ఏ విధంగా నోటిఫికేషన్ ఇస్తారు

AP News: అసలు ఆ నిర్ణయం ఎవరిది? : సొము వీర్రాజు

అమరావతి : బీజేపీ ఎపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణపై విరుచుకుపడ్డారు. కాణిపాకంలో వినాయకుడి అభిషేకం టిక్కెట్ ధర పెంచేందుకు దేవాదాయ శాఖ అభిప్రాయ సేకరణ చేయలేదని మంత్రి చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఎవరికీ తెలియకుండా అభిప్రాయ సేకరణకు  ఏ విధంగా నోటిఫికేషన్ ఇస్తారు? అని మండిపడ్డారు. ఈ విషయంలో అధికారి అవగాహనా రాహిత్యమా? లేక మంత్రి మౌఖిక ఆదేశాలా? అన్నది తేలాల్సి ఉందన్నారు. దేవాలయాలకు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ అన్న విషయాన్ని మంత్రి గుర్తుంచుకోవాలని, దేవాలయాలకు సంబంధించి ఏ సమస్య ఉత్పన్నమైనా తామే స్పందిస్తున్నామని, స్పందిస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. దేవాలయాల రక్షణ బీజేపీ బాధ్యతగా భావిస్తుందని పేర్కొన్నారు.  

Updated Date - 2022-10-07T23:54:48+05:30 IST