మరి కేసీఆర్ ఎందుకు ప్రకటించడం లేదు?: Bandi Sanjay

ABN , First Publish Date - 2022-06-26T00:51:19+05:30 IST

Hyderabad: జీవో 317 విడుదలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఉద్యోగులు,

మరి కేసీఆర్ ఎందుకు ప్రకటించడం లేదు?: Bandi Sanjay

Hyderabad: జీవో 317 విడుదలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. 


మంత్రులు, ఎమ్మెల్యేలంతా వారి ఆస్తుల వివరాలు బయటపెట్టాలి

‘‘చదువు చెప్పే సర్కారీ టీచర్లు ఇకపై  ఏటా ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని, ఇకపై ఆస్తులు అమ్మాలన్నా... కొనాలన్నా ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చెప్పడం వేధింపుల్లో భాగమే. ఉద్యోగులకు జీతాలే సక్రమంగా చెల్లించకుండా... ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించని కేసీఆర్ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం హస్యాస్పదం. కేసీఆర్ సీఎం కాకముందు ఆయన  ఆస్తులెన్ని? ఆ తరువాత కూడబెట్టిన ఆస్తులెన్ని? ఆ వివరాలను ఏటా  ఎందుకు విడుదల చేయడం లేదు? ఇకపై సీఎం సహా ఆయన కుటుంబ సభ్యులంతా  ఏటా ఆస్తుల వివరాలు బయటపెట్టాలి. కేసీఆర్ కేబినెట్‌లోని మంత్రుల ఆస్తులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమ ఆస్తుల వివరాలను బయటపెట్టాలి.’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.  

Updated Date - 2022-06-26T00:51:19+05:30 IST