కరోనా ఓదార్పు యాత్రలు ఎందుకు చేయరు?: గోవిందరెడ్డి
ABN , First Publish Date - 2021-04-22T10:42:17+05:30 IST
‘‘సీఎం జగన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓదార్పు యాత్రలు చేశారు. ఇప్పుడు కరోనాతో 700 మంది చనిపోతే వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఎందుకు ఓదార్పు యాత్రలు చేయరు?’’
అమరావతి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం జగన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓదార్పు యాత్రలు చేశారు. ఇప్పుడు కరోనాతో 700 మంది చనిపోతే వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఎందుకు ఓదార్పు యాత్రలు చేయరు?’’ అని టీడీపీ నేత కాకి గోవింద రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ‘‘కరోనా మొదటి దశ సమయంలో పరీక్షలు చేసిన బస్సుల కంపెనీకి డబ్బులు చెల్లించకపోవడంతో వారు పరీక్షల నిర్వహణకు ముందుకు రావడం లేదు. మొదటి దశలో ఆస్పత్రుల్లో, పరీక్షల కేంద్రాల్లో పనిచేసిన సిబ్బందిని తీసివేశారు. వారికి వేతన బకాయులు కూడా ఇవ్వలేదు. దీంతో సిబ్బంది లేక పరీక్షలు, చికిత్సల వ్యవస్థ కుప్పకూలింది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.