భర్తపై అనుమానంతో భార్య యాసిడ్ దాడి

ABN , First Publish Date - 2020-11-28T15:25:15+05:30 IST

సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్త మీద అనుమానంతో భార్య యాసిడ్ దాడి చేసింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలోని

భర్తపై అనుమానంతో భార్య యాసిడ్ దాడి

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్త మీద అనుమానంతో భార్య యాసిడ్ దాడి చేసింది. జిల్లాలోని కోదాడ శ్రీనివాసనగర్‎లో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త నరసింహారావు మీద అనుమానం రావడంతో భార్య లక్ష్మీ యాసిడ్‌తో దాడికి పాల్పడింది. యాసిడ్ దాడిలో భర్త నరసింహారావు ముఖం మొత్తం ఖాళీ పోవడంతో పరిస్థితి విషమం మారింది. ఈ ఘటనతో అక్కడున్న స్థానికులు వెంటనే నరసింహారావును దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతోనే దాడి చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు.

Updated Date - 2020-11-28T15:25:15+05:30 IST