మరణంలోనూ వీడని బంధం

ABN , First Publish Date - 2022-06-08T15:31:29+05:30 IST

భర్త మృతి తట్టుకోలేని భార్య మృతిచెందిన ఘటన తిరునల్వేలి జిల్లాలో చోటుచేసుకుంది. అంబాసముద్రం సమీపం విక్రమసింగపురం ప్రాంతానికి చెందిన

మరణంలోనూ వీడని బంధం

పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 7: భర్త మృతి తట్టుకోలేని భార్య మృతిచెందిన ఘటన తిరునల్వేలి జిల్లాలో చోటుచేసుకుంది. అంబాసముద్రం సమీపం విక్రమసింగపురం ప్రాంతానికి చెందిన సౌందర్‌రాజన్‌ (72) ఓ ప్రైవేటు మిల్లులో పనిచేసి పదవీవిరమణ పొందారు. సౌందర్‌రాజన్‌ సోమవారం రాత్రి హఠాత్తుగా గుండెపోటుకు గురవడంతో బంధువులు అతడిని అంబాసముద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకు తిరునల్వేలి ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య అళగుతిరుమలై ముత్తమ్మాళ్‌ భర్త మరణాన్ని జీర్ణించుకోలేక మంగళవారం ఉదయం మృతిచెందింది. భార్యాభర్తలు 12 గంటల వ్యవధిలో మృతిచెందడం ఆ ప్రాంతంలో విషాదం నింపింది.

Updated Date - 2022-06-08T15:31:29+05:30 IST