మృత్యువులోనూ వీడని బంధం
ABN , First Publish Date - 2022-05-29T18:31:20+05:30 IST
మృత్యువు కూడా వారి బంధాన్ని విడదీయ లేకపోయింది. కన్న కొడుకులైనా కాటి వరకే...కట్టుకున్నదైనా వీధి వరకే..అంటారు. కానీ మరణంలోనూ జట్టు కట్టిన ఆ
- భర్త కన్నుమూసిన కాసేపటికే తనువు చాలించిన భార్య
హోసూరు(బెంగళూరు): మృత్యువు కూడా వారి బంధాన్ని విడదీయ లేకపోయింది. కన్న కొడుకులైనా కాటి వరకే...కట్టుకున్నదైనా వీధి వరకే..అంటారు. కానీ మరణంలోనూ జట్టు కట్టిన ఆ దంపతులను చూ సి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. దంపతులిద్దరూ కాసేపు సమయంలోనే మృత్యువాత పడిన సంఘటన నగరంలో జరిగింది. హోసూరు బారతీయార్ నగర్కు చెందిన రిటైర్డ్ టీచర్ మాణిక్యం (70) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. విషాదంలో మునిగిన ఆయన భార్య గోమతి (63) కూడా కాసేపటికే తనువు చాలించింది. శనివారం వీరి అంత్యక్రియలను వీరి ఇద్దరి కుమారులు, బంధువులు నిర్వహించారు. మరణంలోను వీడదీయరాని ఈ ఘటన బంధువులను విషాదంలో నింపింది. దేవుడు కూడా వీడదీయలేని వీరి బంధాన్ని తలుచుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.