Australia నుంచి వస్తూ అనంతలోకాలకు..!

ABN , First Publish Date - 2022-04-28T12:14:02+05:30 IST

తెలంగాణ రాష్ట్రం చెవ్వెంల మండల గుంపుల గ్రామం వద్ద జాతీయ రహదారి..

Australia నుంచి వస్తూ అనంతలోకాలకు..!

  • రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి 


ఎన్టీఆర్/రెడ్డిగూడెం : తెలంగాణ రాష్ట్రం చెవ్వెంల మండల గుంపుల గ్రామం వద్ద జాతీయ రహదారి 65పై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రెడ్డిగూడెం గ్రామానికి చెందిన పెదగమళ్ల హేమామ్‌ బ్రదర్‌ - రజిత దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా వారి పిల్లలకు గాయాలయ్యాయి. ఆస్ట్రేలియా నుంచి వస్తూ హైదరాబాద్‌లో దిగి స్వగ్రామమైన రెడ్డిగూడేనికి వచ్చేందుకు ప్రైవేటు కారును మాట్లాడుకొని వస్తుండగా డ్రైవర్‌ నిద్రమత్తులో డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆ ప్రమాదం జరిగింది. వారి స్వగ్రామమైన రెడ్డిగూడెంలో మృతదేహాలను ఉంచారు. జడ్పీటీసీ సభ్యుడు పాలంకి విజయభాస్కర రెడ్డి, పలువురు ప్రముఖులు సందర్శించి  నివాళులర్పించారు.

Updated Date - 2022-04-28T12:14:02+05:30 IST