అక్క భర్తతో యువతి వివాహేతర సంబంధంపై ఆగ్రహించిన భర్త.. అతడితో గొడవపడిన అత్తమామలు.. ఆ తరువాత..

ABN , First Publish Date - 2022-05-12T08:44:04+05:30 IST

అక్క భర్తతో ఆమె భార్య వివాహేతర సంబంధం గురించి ఆమె భర్తకు తెలిసింది. దీనిపై అతను భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. భార్యను తిట్టాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అందరూ కలిసి అల్లుడి ప్రాణం తీశారు. ఈ ఘటన బిహార్‌లోను జమూయీ ప్రాంతంలో వెలుగు చూసింది...

అక్క భర్తతో యువతి వివాహేతర సంబంధంపై ఆగ్రహించిన భర్త.. అతడితో గొడవపడిన అత్తమామలు.. ఆ తరువాత..

అక్క భర్తతో ఆమె భార్య వివాహేతర సంబంధం గురించి ఆమె భర్తకు తెలిసింది. దీనిపై అతను భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. భార్యను తిట్టాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అందరూ కలిసి అల్లుడి ప్రాణం తీశారు. ఈ ఘటన బిహార్‌లోను జమూయీ ప్రాంతంలో వెలుగు చూసింది.

రంజిత్ యాదవ్ అనే వ్యక్తికి కొంత కాలం క్రితం పెళ్లయింది. గడిచిన ఆదివారం అత్తమామల ఇంటికి వెళ్లిన అతను.. తన భార్య, తోడల్లుడు(భార్య అక్క భర్త) అభ్యంతరకర పరిస్థితిలో ఉండగా చూశాడు. దాంతో కోపంతో ఊగిపోయి ఆమెను, ఆ కుటుంబాన్ని తిట్టాడు. అయితే ఆ కుటుంబ సభ్యులంతా వచ్చి రంజిత్‌దే తప్పు అని వాదించారు. దీంతో ఆ రోజు రాత్రి తమ్ముడికి ఫోన్ చేసిన రంజిత్.. అత్తమామల కుటుంబం అంతా చాలా పెద్ద తప్పు చేస్తోందని, తనతో చాలా నీచంగా మాట్లాడుతోందని, ఏమైనా జరగొచ్చని హెచ్చరించాడు.


ఆ మరుసటి రోజు అన్నయ్య ఇంటికి రాకపోవడంతో.. రంజిత్ సోదరుడు సుభాష్ పోలీసులను ఆశ్రయించాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఊరికి కొంత దూరంలో ఉన్న అడవి సమీపంలో రంజిత్ నడిపే ఆటో దొరికింది. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం సమయంలో రంజిత్ మృతదేహం కూడా లభించింది. పోస్టుమార్టం కోసం అతని శవాన్ని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. సుభాష్ పెట్టిన కేసు ప్రకారం రంజిత్ అత్తమామల కుటుంబంసై కేసు నమోదు చేసుకున్నారు. మొత్తం పది మందిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.


Read more