ఢిల్లీ తీసుకెళ్లలేదని కోపం తెచ్చుకున్న భార్య.. దాంతో ఆ భర్త పరిస్థితి ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-03-14T17:07:28+05:30 IST

పాపం.. ఢిల్లీ తీసుకెళ్లలేదని భార్య ఆగ్రహానికి బలైన భర్త ఘోరంగా దెబ్బలు తిన్నాడు.

ఢిల్లీ తీసుకెళ్లలేదని కోపం తెచ్చుకున్న భార్య.. దాంతో ఆ భర్త పరిస్థితి ఏమైందంటే..

పాపం.. ఢిల్లీ తీసుకెళ్లలేదని భార్య ఆగ్రహానికి బలైన భర్త ఘోరంగా దెబ్బలు తిన్నాడు. ఆర్మీలో పనిచేసే ఆ సైనికుడు భార్య చేతిలో దెబ్బలు తిని పోలీసులను ఆశ్రయించాడు. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాకు చెందిన చునారామ్ అనే వ్యక్తి ఆర్మీలో పనిచేస్తున్నాడు. రెండు నెలలు సెలవుల కోసం జనవరి 11న బార్మర్ వెళ్లాడు. ఈ నెల 11న అతని భార్య నోజీ తనను, పిల్లలను విహార యాత్ర కోసం ఢిల్లీ తెసుకెళ్లమని అడిగింది. రూ.50 వేలు ఖర్చవుతుందని భయపడిన చునారామ్ డబ్బులు లేవని చెప్పాడు. 


తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య తన సోదరుడికి ఫోన్ చేసి పిలిపించింది. చునారామ్‌ను ఒక గదిలో బంధించి నోజీ, ఆమె సోదరుడు చితక్కొట్టారు. దాదాపు ఐదు గంటలు అతడిని కొడుతూనే ఉన్నారు. అనంతరం ఇద్దరూ అతడిని వదిలేసి ఇంటి నుంచి పరారయ్యారు. దెబ్బల నుంచి కాస్త కోలుకున్న తర్వాత చునారామ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్యపై, ఆమె సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చునారామ్, నోజికి 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. 

Updated Date - 2022-03-14T17:07:28+05:30 IST