పొద్దున్నే నిద్రలేచిన భర్తకు గదిలో కనిపించిన దృశ్యాన్ని చూసి మైండ్బ్లాంక్.. రూ.5 వేల కోసం..
ABN , First Publish Date - 2022-04-12T18:39:51+05:30 IST
ఆ మహిళ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది.. హాస్పిటల్లో చూపించుకోవాలనుకుని భర్తను రూ.5 వేలు అడిగింది..
ఆ మహిళ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది.. హాస్పిటల్లో చూపించుకోవాలనుకుని భర్తను రూ.5 వేలు అడిగింది.. తన దగ్గర డబ్బులు లేవని, తర్వాతి రోజు ఇస్తానని భర్త చెప్పాడు.. భర్త మాటలు ఆమెకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి.. భర్త ఉదయం లేచి చూసే సరికి ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. అంత్యక్రియల సమయంలో భార్య చితిలోకి భర్త కూడా దూకేశాడు.. అయితే చుట్టుపక్కల వాళ్లు అతడిని కాపాడారు..
ఉత్తర్ప్రదేశ్ మహోబా జిల్లా జైత్పుర్ గ్రామంలో బ్రిజేష్, ఉమ దంపతులు నివసిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఉమ అనారోగ్యం పాలైంది. ఎంతకీ ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో హాస్పిటల్కు వెళ్లాలని భావించింది. ట్రీట్మెంట్ కోసం రూ.5 వేలు కావాలని భర్త బ్రిజేష్ను అడిగింది. తన దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవని, తర్వాతి రోజు ఉదయం స్నేహితులను అడిగి తీసుకుంటానని భార్యకు బ్రిజేష్ చెప్పి నిద్రపోయాడు. భర్త సమాధానంతో కలత చెందిన ఉమ ఉరేసుకుని చనిపోయింది. ఉదయం నిద్ర లేచి ఉరికి వేలాడుతున్న భార్యను చూసిన బ్రిజేష్ ఆమెను వెంటనే హాస్పిటల్కు తరలించాడు.
అప్పటికే ఉమ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోస్ట్మార్టం అనంతరం ఉమ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు శ్మశానవాటికకు తీసుకెళ్లారు. భార్య ఆత్మహత్యతో తీవ్ర మనస్తాపానికి గురైన బ్రిజేష్ మండుతున్న భార్య చితిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడున్న వ్యక్తులు అతడిని కాపాడారు. భార్య చనిపోయాక తనకు బతకాలని లేదని బ్రిజేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, కట్నం కోసమే భర్త, అత్తమామలు తమ కూతుర్ని హత్య చేశారని ఉమ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.