నా భార్యే నన్ను మోసం చేసింది.. ఇక ఈ బతుకెందుకంటూ.. ఘోరానికి పాల్పడిన భర్త.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-07-30T18:12:16+05:30 IST

ఆ వ్యక్తి తన భార్యను ఎంతగానో నమ్మాడు.. ఎంతో డబ్బు ఖర్చుపెట్టాడు..

నా భార్యే నన్ను మోసం చేసింది.. ఇక ఈ బతుకెందుకంటూ.. ఘోరానికి పాల్పడిన భర్త.. అసలేం జరిగిందంటే..

ఆ వ్యక్తి తన భార్యను ఎంతగానో నమ్మాడు.. ఎంతో డబ్బు ఖర్చుపెట్టాడు.. తీరా గమ్యం చేరాక ఆ యువతి తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది.. కట్టుకున్న భర్తనే మోసం చేసింది.. దీనిని ఆ వ్యక్తి భరించలేకపోయాడు.. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.. పంజాబ్‌లోని బర్నాలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


గోవింద్‌పుర అనే గ్రామానికి చెందిన బల్వీందర్ సింగ్ తన కొడుకు లవ్‌ప్రీత్‌ కెనడాలో స్థిరపడాలని కోరుకున్నాడు. అయితే అతను ఐఈఎల్‌టీఎస్ (ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) పరీక్ష పాస్ కాలేకపోయాడు. ఈ పరీక్ష పాస్ అయితే తప్ప కెనడా వీసా రాదు. దీంతో బల్వీందర్.. బియాంత్ కౌర్ అనే యువతితో కొడుకు పెళ్లి నిశ్చయించాడు. ఆమె ఐఈఎల్‌టీఎస్ పరీక్ష పాస్ కావడంతో లక్షలు ఖర్చు పెట్టి ఆమెను కెనడా పంపించాడు. ఆమె అక్కడ కంప్యూటర్ కోర్సు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించిన తర్వాత లవ్‌ప్రీత్‌ను కూడా అక్కడకు తీసుకెళ్లాలనేది ఒప్పందం. 


అనుకున్నట్టుగానే ఆమె కోర్సు పూర్తి చేసి ఈ ఏడాది భారత్‌కు తిరిగి వచ్చి లవ్‌ప్రీత్‌ను వివాహం చేసుకుంది. తను ముందుగా కెనడా వెళ్లి అక్కడ ఫ్యామిలీ వీసా కోసం అప్లై చేస్తానని చెప్పింది. అందుకుగానూ మరికొంత డబ్బు తీసుకుని వెళ్లింది. అయితే కెనడా వెళ్లిన తర్వాత ఆమె నుంచి స్పందన లేదు. లవ్‌ప్రీత్ ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేసేది కాదు. దీంతో తాము ఆమె చేతిలో మోసపోయాని లవ్‌ప్రీత్ ఫ్యామిలీ గ్రహించింది. బియాంత్ కోసం లవ్‌ప్రీత్ కుటుంబం దాదాపు పాతిక లక్షల వరకు ఖర్చుపెట్టింది. దీంతో మనస్తాపానికి గురైన లవ్‌ప్రీత్ గత సోమవారం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీంతో బల్వీందర్ సింగ్ పోలీసులను ఆశ్రయించి బియాంత్‌పై కేసు పెట్టాడు. పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-07-30T18:12:16+05:30 IST