భర్త రోజూ తాగొచ్చి కొడుతున్నాడని.. భార్య సంచలన నిర్ణయం.. ముగ్గరు స్నేహితులను ఇంటికి పిలిచి..

ABN , First Publish Date - 2022-06-26T19:03:59+05:30 IST

ఆ భార్యభర్తలకు కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన మొదట్లో వారి సంసారం బాగానే ఉంది. కానీ ఆ తర్వాత కలహాలు మొదలయ్యాయి. భర్త తాగుడుకు అలవాటు పడ్డాడు. అంతేకాకుండా మద్యం మత్తులో భార్యతో గొడవకు దిగి.. ఆమెను చితకబాదేవాడు. ఇది నిత్యకృత్యం అవడంతో ఆమెలో ఓపిక నశించింది. ఈ నేపథ్యంలోనే సంచల

భర్త రోజూ తాగొచ్చి కొడుతున్నాడని.. భార్య సంచలన నిర్ణయం..  ముగ్గరు స్నేహితులను ఇంటికి పిలిచి..

ఇంటర్నెట్ డెస్క్: ఆ భార్యభర్తలకు కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన మొదట్లో వారి సంసారం బాగానే ఉంది. కానీ ఆ తర్వాత కలహాలు మొదలయ్యాయి. భర్త తాగుడుకు అలవాటు పడ్డాడు. అంతేకాకుండా మద్యం మత్తులో భార్యతో గొడవకు దిగి.. ఆమెను చితకబాదేవాడు. ఇది నిత్యకృత్యం అవడంతో ఆమెలో ఓపిక నశించింది. ఈ నేపథ్యంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. స్నేహితులను ఇంటికి పిలిచి.. భర్తను హతమార్చింది. అనంతరం ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..



బిహార్‌లోని దానాపూర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్ రాజు అనే వ్యక్తికి రోజీ అనే మహిళతో కొన్నాళ్ల క్రితం పెళ్లైంది. వివాహం జరిగిన తర్వాత కొన్ని రోజుల వరకూ బాగానే ఉన్న మహ్మద్.. ఆ తర్వాత మద్యానికి అలవాటుపడ్డాడు. రోజూ రాత్రి తాగి ఇంటికి రావడం పరిపాటయింది. మద్యం మత్తులో భార్యతో గొడవకు దిగేవాడు.. ఈ క్రమంలోనే ఆమెను ఇష్టమొచ్చినట్టు కొట్టేవాడు. దీంతో ఆమె ఆ బాధను ఇనాళ్లు భరించింది. భర్త వైఖరిలో మార్పు వొస్తుందేమో అని ఆశగా ఎదురు చూసింది. తాజాగా ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. భర్తలో మార్పు రావడం అసాధ్యమని.. అతడిని హతమార్చడానికి పక్కా ప్లాన్ వేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురు స్నేహితులను ఇంటికి పిలిచి వాళ్ల సహాయంతో మహ్మద్‌ను హత్య చేసింది. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని స్థానికంగా ఉన్న నీటి కాలువలో పడేసింది. కాగా.. గుర్తు తెలియని మృతదేహం లభించిందనే సమాచారం రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ మృతదేహం మహ్మద్‌దిగా పోలీసులు గుర్తించారు. అనంతరం రోజీని విచారించగా ఆమె.. తన తప్పు ఒప్పుకుంది. దీంతో రోజీతో పాటు ఆమె స్నేహితులు అతుల్ కుమార్, జితేంద్ర కుమార్, మోహద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. 


Updated Date - 2022-06-26T19:03:59+05:30 IST