కన్నకూతురిపై అత్యాచారం చేశాడంటూ భర్తపైనే కేసు పెట్టిన భార్య.. 20 నెలల తర్వాత బయటపడ్డ షాకింగ్ నిజాలివీ..!

ABN , First Publish Date - 2022-09-09T21:01:37+05:30 IST

కన్న కూతురిపై అత్యాచారం చేశానని నాపై ఆరోపణలు వచ్చాయి. ప్రజలందరూ నన్ను దూషించారు.

కన్నకూతురిపై అత్యాచారం చేశాడంటూ భర్తపైనే కేసు పెట్టిన భార్య.. 20 నెలల తర్వాత బయటపడ్డ షాకింగ్ నిజాలివీ..!

`కన్న కూతురిపై అత్యాచారం చేశానని నాపై ఆరోపణలు వచ్చాయి. ప్రజలందరూ నన్ను దూషించారు. 20 నెలలు జైలులో ఉన్నాను. అక్కడ ఇతర ఖైదీలు దుర్భాషలాడారు, అవమానించారు. సెప్టెంబర్ 1, 2022న కోర్టు నన్ను నిర్దోషిగా విడుదల చేసింది. కానీ ఈ 20 నెలల్లో నేను ఎన్నో అవమానాలను పొందాను. ఇప్పుడు నేను ప్రపంచం ముందుకు ఎలా వెళ్లాలి. నేను నా కుమార్తెపై అత్యాచారం చేయలేదని, నేను నిర్దోషినని ఎవరి దగ్గరికి వెళ్లి చెప్పుకోవాలి'.. ఇదీ కూతురిపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టైన ఓ నిరుపేద తండ్రి ఆవేదన. 


ఇది కూడా చదవండి..

దారుణం.. ఫీజు కట్టలేదని విద్యార్థులను బంధించిన యాజమాన్యం.. ఆహారం తినకుండా నిర్బంధం.. చివరకు..


రాజస్థాన్‌ (Rajasthan)లోని నాగౌర్‌‌కు సమీపంలోని ఓ గ్రామంలో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్న వ్యక్తిపై 26 డిసెంబర్ 2020న అతని భార్య కేసు పెట్టింది. తన 12 ఏళ్ల కుమార్తెపై భర్త అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. జైలులో ఏడాదిన్నర గడిపాడు. ఆ వ్యక్తిని జైలు పాలు చేసేందుకు అతడి భార్య చేసిన కుట్ర విచారణలో బయటపడింది. ఇంటిని తన పేరు మీద రాయనందుకు ఆమె తన భర్త మీద పగబట్టింది. తన సోదరుడితో కలిసి అమాయకుడైన భర్తపై కుట్ర చేసింది. అందుకు తన 12 ఏళ్ల కూతురిని వాడుకుంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్తను అరెస్ట్ చేశారు. 12 ఏళ్ల బాలికను వైద్య పరీక్షలకు పంపారు. 


వైద్య పరీక్షల్లో ఆ బాలికపై అత్యాచారం జరగలేదని బయటపడింది. దీంతో తన భర్త అత్యాచారయత్నం చేశాడని మహిళ మాట మార్చింది. ఎన్నో విచారణలు, క్రాస్ ఎగ్జామినేషన్‌లు అయిన తర్వాత కోర్టులో ఆ మహిళ అసలు నిజం అంగీకరించింది. కోర్టు ఆ వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసింది. జైలు నుంచి విడుదలైన అతను తనను తాను ఓ గదిలో బంధించుకున్నాడు. ఎవరితోనూ మాట్లాడలేదు. భార్య చేసిన కుట్రను తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. 

Updated Date - 2022-09-09T21:01:37+05:30 IST