భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం

ABN , First Publish Date - 2021-07-27T05:24:40+05:30 IST

బంధువుల ఇంట్లో జరిగిన దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న ఆ దంపతుల కుంటుంబంలో రోడ్డుప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం

 తలమీద నుంచి దూసుకెళ్లిన లారీ

భార్యకు స్వల్పగాయాలు

వైరా, జూలై 26: బంధువుల ఇంట్లో జరిగిన దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న ఆ దంపతుల కుంటుంబంలో రోడ్డుప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భార్య కళ్లెదుటే యువకుడు దుర్మరణపాలైన ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా వైరాలో సోమవారం జరిగింది. ఖమ్మంలోని దానవాయిగూడెం ప్రాంతానికి చెందిన తమ్మారపు బాలకృష్ణ(36) తన భార్య సుజాతను తీసుకుని.. ద్విచ్రవాహనంపై తల్లాడ మండలంలోని మల్లవరం గ్రామంలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన దశదినకర్మకు వెళ్లి బంధువులతో పాటు తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో వైరా కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలో వైరా నుంచి తల్లాడ వైపు వెళ్తున్న ఓ లారీ ఎదురుగా వచ్చి వారిని ఢొకొట్టడంతో ఇద్దరూ చెరోవైపు కిందపడ్డారు. ఈ క్రమంలో లారీ టైరు బాలకృష్ణ తలపైనుంచి వెళ్లడంతో.. బాలకృష్ణ ధరించిన హెల్మెట్‌ సహా తలభాగం అంతా ఛిద్రమైంది. సుజాత స్వల్పగాయాలతో బయటపడగా.. ఆమె కళ్లెదుకే క్షణకాలంలో భర్త చనిపోవ డంతో ఆమె గుండెలవిసేలా రోదించింది. అయితే ఆ వెనుకే వస్తున్న బంధువులు.. బాలకృష్ణను ఢీకొట్టిన లారీని అడ్డుకుని.. పోలీసులకు సమాచారమిచ్చారు. వైరా ట్రెయినీ ఎస్‌ఐ యాయాతి రాజు కేసు నమోదు చేసి.. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలకృష్ణ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.



Updated Date - 2021-07-27T05:24:40+05:30 IST